సినీ ప్రముఖులకు సంబంధించిన తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకనే.. సినిమా వాళ్ల గురించి ఉన్నవి లేనివి కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి. అవి వాస్తవమా..? కాదా..? అనేది పక్కన పెడితే వింటానికి.. చదవడానికి బాగుంటాయని అలాంటి వాటిని రాస్తుంటారు.. ప్రచారంలోకి తెస్తుంటారు కొందరు. అసలు విషయానికి వస్తే… నాగచైతన్య, సమంత విడిపోవడం ఎంతటి సంచలనం అయ్యిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ వార్తను కొంత మంది నమ్మలేకపోతున్నారు అంటే ఇది నిజంగా నిజం.
అయితే… విడాకులు తర్వాత సమంత తనదైన శైలిలో స్పందించింది కానీ.. నాగచైతన్య మాత్రం ఎప్పటిలా సైలెంట్ గా ఉన్నారు. నాగార్జున.. నాగచైతన్య, సమంత విడాకుల గురించి స్పందించడానికి ఆసక్తి చూపించలేదు. అయితే… బంగార్రాజు సినిమా సక్సస్ ను పురస్కరించుకుని నాగార్జున బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో నాగచైతన్య, సమంత విడాకులు గురించి స్పందించారని వార్తలు వచ్చాయి.
ఇందులో సమంతే ముందుగా విడాకులకు కోరుకుందని.. విడాకుల కోసం అప్లై చేసిందని… నాగచైతన్య ఆమె నిర్ణయానికి విలువ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి విడాకులు తీసుకున్నారు అని నాగార్జున చెప్పారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. 2021 న్యూయర్ ను కూడా వాళ్లిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో నాకు తెలియడం లేదు. వాళ్లిద్దరి మధ్య విడిపోయేంత పెద్ద సమస్యలు కూడా ఏమీ లేవు అని నాగార్జున చెప్పారని ఈరోజు సోషల్ మీడియాలోను, ఎలక్ట్రానికి మీడియాలోను తెగ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలోనే కాకుండా ఎలక్ట్రానికి మీడియాలో కూడా ఈ వార్తలు రావడంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే… ఈ వార్తల పై నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ… ఈరోజు నేను చెప్పినట్టుగా నాగచైతన్య, సమంత గురించి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఏంటీ నాన్ సెన్స్.. వార్తలు ఇచ్చేముందు తెలుసుకుని ఇవ్వండి. రూమర్స్ ని ప్రచారం చేయద్దు అని కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అదీ.. మేటరు.