ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పటి వరకు మెగా హీరోలతో సినిమాలు చేసింది. ఇక నుంచి మెగా హీరోలతోనే కాకుండా.. వేరే హీరోలతో కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ… గీతా ఆర్ట్స్ లో సినిమా చేయలేదు. ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే… ఆమధ్య సూపర్ స్టార్ మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఇప్పుడు నటసింహ బాలకృష్ణతో భారీ చిత్రం నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజా అప్ డేట్ ఏంటంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా చేసిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వశిష్ఠ్ కు ఇప్పటికే అయిదులక్షలు అడ్వాన్స్ ఇచ్చారని తెలిసింది. ఆరు నెలలు రిటైర్ అవుతారు అనగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయకూడదు. ఆ రూల్ ను ఆసరాగా తీసుకుని ఓ పోలీస్ అధికారి అవినీతిని, రౌడీ ఇజాన్ని ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్ తో అల్లిన కథ ఏదో వుందని టాక్ వినిపిస్తోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార పార్ట్ 2 అయిన తరువాత ఈ ప్రాజెక్టు వుండే అవకాశం వుంది. ఈ కథను బాలయ్యకు వినిపించి ఓకే అనిపించే ప్రయత్నాల్లో అల్లు అరవింద్ వున్నారని సమాచారం. మహేష్ బాబుతో అల్లు అరవింద్ సినిమా చేయాలనుకుంటే.. సెట్ కాలేదు. మరి.. బాలయ్యతో సెట్ అవుతుందేమో చూడాలి.