బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం. అంతే కాదు.. ఇండియన్ సినిమా పవర్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో తెలుగు సినిమా మార్కెట్ తో పాటు స్థాయి బాగా పెరిగింది. డిమాండ్ కూడా ఏర్పడింది. అందుకనే సినిమా నిర్మాణంతో పాటు హీరోల రెమ్యూనరేషన్స్ టాలీవుడ్లోనే కాదు ఇండియాలోనే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ ఇంటస్ట్రింగ్ న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.
ఇంతకీ విశేషం ఏంటంటే.. బాహుబలి తరువాత తెలుగు సినిమా స్థాయి మార్కెట్ పెరిగిన నేపథ్యంలో మన హీరోల స్థాయి కూడా స్కై హైకి చేరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఓ సర్వేలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఇద్దరు హీరోల గురించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ ఇద్దరు హీరోలు మన తెలుగు వారే కావడం విశేషం. ఇంతకీ ఎవరంటారా..? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
ప్రభాస్ కు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దీంతో ప్రభాస్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ క్యూకడుతున్నారు. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలకు ఇదే స్థాయిలో తీసుకున్నారని సమాచారం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్నరెండు చిత్రాలకు గానూ 200 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ప్రభాస్ తరువాత ఈ స్థాయిలో పారితోషికం సొంతం చేసుకుంటున్న హీరోగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
'Heeramandi' is the first web series created by the big Bollywood director Sanjay Leela Bhansali.…
'పుష్ప 2' ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ క్రేజీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్…
Universal star Kamal Haasan came into super form with the hit 'Vikram'. With this movie,…
‘విక్రమ్‘ హిట్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు విశ్వనటుడు కమల్ హాసన్. ఈ సినిమాతో కనీవినీ ఎరుగని కలెక్షన్ల…
బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి‘. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే…
Rebel Star's most awaited 'Kalki 2898 A.D.' release is just two months away. Kalki is…