సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. చివరగా వచ్చిన సరిలేరు నీకెవ్వరుకు యావరేజ్ టాక్ వచ్చినా.. లాస్ లు లేవు. తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయినా.. సడెన్ గా సీన్ లోకి వచ్చాడు పరశురామ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదలైన సినిమా సర్కారువారి పాట. గ్రాండ్ గానే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని షెడ్యూల్స్ లేట్ అయింది. అందుకే సంక్రాంతి నుంచి ఏప్రిల్ కు ఏప్రిల్ నుంచి మే వరకూ విడుదల తేదీలు మారాయి. ఇంకా మారతాయి అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. కానీ అవేం లేవు అంటోంది మూవీ టీమ్. ఇక ఇప్పటి వరకైతే ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతున్నారు. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఫాదర్, సన్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ అండ్ యాక్షన్ ఎంటరటైనర్ గా వస్తోన్న ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ కు మరోసారి పోకిరి రేంజ్ వినోదం అందిస్తుందంటున్నారు. మరి ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో చేయబోతోన్న సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటో తెలుసా..?
ఒక సినిమా కోసం మహేష్ బాబు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆ కష్టాన్ని మర్చిపోయేందుకు అప్పుడప్పుడూ.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్స్ కు వెళుతుంటాడు. ఈ వెకేషన్స్ లో కాస్త రిలాక్స్ అయ్యాక నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు. సో.. ఇప్పుడు కూడా సర్కారువారి పాట విడుదలైన తర్వాత ఓ వారం పది రోజులు సమ్మర్ వెకేషన్ కు వెళ్లబోతున్నాడు. అక్కడి నుంచి రాగానే త్రివిక్రమ్ తో మూవీ మొదలవుతుంది. మే నెల చివరి వారంలో అఫీషియల్ గా ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ నుంచే మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు వెండితెరపై పెద్ద విజయం సాధించకపోయినా.. బుల్లితెరపై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తర్వాత వచ్చిన ఖలేజా మహేష్ లోని కామిక్ యాంగిల్ ను అద్భుతంగా చూపించింది. కానీ అప్పటికే వచ్చిన పోకిరి టైమ్ మాస్ ఇమేజ్ వల్ల ఈ చిత్రాన్ని ఆడియన్స్ పట్టించుకోలేదు. మొత్తంగా ఓ పన్నెండేళ్ల తర్వాత ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా వస్తోంది. అది జూన్ లో మొదలై.. మధ్యలో మరో కరోనా ఇబ్బంది పెట్టకపోతే వచ్చే యేడాది వేసవికి విడుదలవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…