మహేష్ బాబు – త్రివిక్రమ్ మూవీ షెడ్యూల్ ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్నాడు. చివరగా వచ్చిన సరిలేరు నీకెవ్వరుకు యావరేజ్ టాక్ వచ్చినా.. లాస్ లు లేవు. తర్వాత వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయినా.. సడెన్ గా సీన్ లోకి వచ్చాడు పరశురామ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా మొదలైన సినిమా సర్కారువారి పాట. గ్రాండ్ గానే మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొన్ని షెడ్యూల్స్ లేట్ అయింది. అందుకే సంక్రాంతి నుంచి ఏప్రిల్ కు ఏప్రిల్ నుంచి మే వరకూ విడుదల తేదీలు మారాయి. ఇంకా మారతాయి అనే రూమర్స్ కూడా వస్తున్నాయి. కానీ అవేం లేవు అంటోంది మూవీ టీమ్. ఇక ఇప్పటి వరకైతే ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయబోతున్నారు. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఫాదర్, సన్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ అండ్ యాక్షన్ ఎంటరటైనర్ గా వస్తోన్న ఈ చిత్రం మహేష్ ఫ్యాన్స్ కు మరోసారి పోకిరి రేంజ్ వినోదం అందిస్తుందంటున్నారు. మరి ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో చేయబోతోన్న సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటో తెలుసా..?

ఒక సినిమా కోసం మహేష్ బాబు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఆ కష్టాన్ని మర్చిపోయేందుకు అప్పుడప్పుడూ.. ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్స్ కు వెళుతుంటాడు. ఈ వెకేషన్స్ లో కాస్త రిలాక్స్ అయ్యాక నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేస్తాడు. సో.. ఇప్పుడు కూడా సర్కారువారి పాట విడుదలైన తర్వాత ఓ వారం పది రోజులు సమ్మర్ వెకేషన్ కు వెళ్లబోతున్నాడు. అక్కడి నుంచి రాగానే త్రివిక్రమ్ తో మూవీ మొదలవుతుంది. మే నెల చివరి వారంలో అఫీషియల్ గా ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ �