పవన్ ఈవెంట్ కి కేటీఆర్ …

పవన్ కళ్యాణ్ చిత్రం బీమ్ల నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు కి ఆహ్వానం అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు సినిమా బృందం….

పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ ని కలిసి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావలసిందిగా కోరిన త్రివిక్రమ్ శ్రీనివాస్.

Image

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

Image
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21 న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర
సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.

Image

Related Posts