కంగనా రనౌత్… తన సినిమాల కన్నా.. తన కామెంట్స్ తోనే ఎక్కువుగా వార్తల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ కంగనా. లేటెస్ట్ గా సౌత్ స్టార్స్ పై కంగనా చేసిన కామెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన కంగనా.. బాలీవుడ్ పై మాత్రం విరుచుకుపడింది. ఇంతకీ కంగనా రనౌత్ ఏమన్నదంటే… సౌత్ స్టార్స్ అల్లు అర్జున్, యశ్ల ఫోటోలు షేర్ చేసిన కంగనా దక్షిణాది హీరోలకు, సినిమాలకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందన్నది ప్రస్తావించింది.
దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమా పై వారికున్న ప్యాషన్, వృతిపరమైన నిబద్ధత అపారమైనది అంటూ ఇన్స్టా స్టోరీలో కంగనా రాసుకొచ్చింది. అంతేకాకుండా.. బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి అంటూ అల్లు అర్జున్, యశ్ లకు తనదైన స్టైల్ లో సలహా ఇచ్చేసింది. దీనికి పుష్పలోని ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్ను సైతం యాడ్ చేసింది.
ఈ కంగనా కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కేజీఎఫ్, పుష్ప సినిమాలతో యశ్, అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతలా పాపులారిటీ తెచ్చుకున్నారో తెలిసిందే. అయితే… కంగనా కామెంట్స్ పై అల్లు అర్జున్ కానీ… యశ్ కానీ స్పందించలేదు. మరి… బాలీవుడ్ స్టార్స్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఈవిధంగా మరోసారి కంగనా వార్తల్లో నిలిచింది.
సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్స్ స్పాన్ చాలా తక్కువనే నానుడి ఉంది. అయితే.. త్రిష వంటి కథానాయికను చూస్తే…
తెలుగు కల్చర్ తో జరిగే పెళ్లిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల…
ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో మంచి స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు కన్నడ స్టార్ యశ్.…
'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ 'మిరల్'. 'స్కేర్' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. భరత్ కి…
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటిస్తున్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. తొలి సినిమా…
సినీ జర్నలిస్ట్ శివ మల్లాల నిర్మాతగా పరిచయమవుతోన్న చిత్రం ‘సత్య‘. ‘ప్రతినాన్న కొడుక్కి ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది..…