అఖండ విషయంలో బాలయ్య-బోయపాటిపై ఫ్యాన్స్ ఆగ్రహం

కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే విజయం ముందే సిద్ధంగా ఉంటుంది. అలాంటిదే మా కాంబో అని గత రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య బోయపాటి. బాలకృష్ణ పరాజయాల్లో ఉన్న ప్రతిసారీ బోయపాటితో చేసిన సినిమాలు రెండూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ సారి కూడా అదే జరిగింది. అఖండ అద్భుత విజయం అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉందనే చెప్పాలి. మరి అలాంటి సినిమా ఇచ్చిన బాలయ్య-బోయపాటి కాంబో గురించి మరింత హ్యాపీగా సంబురాలు చేసుకోవాలని కానీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటనే డౌట్ చాలామందికి వస్తుంది కదా..? కానీ ఇక్కడ మేటర్ సినిమా సాధించిన విజయం గురించి కాదు. సినిమాలోని డైలాగ్స్ గురించి. యస్.. బాలయ్య-బోయపాటి సినిమా అంటే పొలిటికల్ డైలాగ్స్ డైనమేట్స్ లా పేలతాయి. ఈ సారి కూడా అధికార ప్రభుత్వంపై అలాంటి డైలాగ్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేసిన బాలయ్య అండ్ తెలుగుదేశం పార్టీ అభిమానులకు అవేవీ కనిపించకపోవడంతో కోపం వచ్చింది. దీంతో బోయపాటితో పాటు రచయిత రత్నంపైనా వారు ఆగ్రహంగా ఉన్నారు. నిజానికి బాలయ్య కూడా ఇలాంటి పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నప్పుడు తన ఇమేజ్ కు తగ్గట్టుగానే పొలిటికల్ గానూ గెయిన్ అయ్యే డైలాగ్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రంలోనూ అలాంటి అవకాశం ఉంది. అయినా వాడుకోకపోవడంతో బాలయ్య కూడా జగన్ కు భయపడ్డాడా అన్న స్థాయిలో ఉంది అభిమానుల ఆగ్రహం.
సినిమాలో పొలిటికల్ గా టచ్ అయ్యే డైలాగ్ ఒక్కటే ఉంది. ‘అంచనా వెయ్యడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా .. పట్టిసీమ తూమా’అనేది మాత్రమే ఆ డైలాగ్. అంతకు మించి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క సెటైర్ కూడా డైలాగ్స్ లేదు. దీంతో ఈ విషయంలో చాలా డైలాగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేసిన అభిమానులు నిరాశపడ్డారు. అవకాశం ఉన్నా.. విమర్శించడానికి భయపడ్డ బాలయ్య-బోయపాటిలపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ ఆగ్రహానికి బోయపాటి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.
Telugu 70mm

Recent Posts

జూన్ లో విడుదలకు ముస్తాబవుతోన్న ‘రాయన్’

ఈతరం యువ కథానాయకుల్లో రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న ఏకైక నటుడు ధనుష్. కేవలం కథానాయకుడుగానే కాకుండా…

2 hours ago

‘Satya’ trailer.. A love story with naturalness

New age romantic love stories are always well received. And.. Tamilians show special attention in…

2 hours ago

‘ప్రతినిధి 2’కి సెన్సార్ ఇబ్బందులేంటి?

ప్రస్తుతం యావత్ దేశంలో ఎన్నికల హడావుడి జోరుగా ఉంది. ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ లో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికలు…

2 hours ago

అతిథి పాత్రకోసం ఆరు కోట్లు పారితోషికం

మంచు విష్ణు నటిస్తూ నిర్మాస్తోన్న మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్ తో…

4 hours ago

‘ఆహా‘లో రానున్న ‘విద్య వాసుల అహం’

‘కోట బొమ్మాళి పి.ఎస్‘ సినిమాతో మంచి విజయాన్నందుకున్న రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల…

4 hours ago

మే 10న బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర

ఈ వేసవిలో ఇప్పటివరకూ ఒకటీరెండు సినిమాలు తప్ప.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలైతే రాలేదు. ఒకవైపు ఎన్నికల వేడి.. మరోవైపు…

4 hours ago