అఖండ విషయంలో బాలయ్య-బోయపాటిపై ఫ్యాన్స్ ఆగ్రహం

కొన్ని కాంబినేషన్స్ వస్తున్నాయంటే విజయం ముందే సిద్ధంగా ఉంటుంది. అలాంటిదే మా కాంబో అని గత రెండు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య బోయపాటి. బాలకృష్ణ పరాజయాల్లో ఉన్న ప్రతిసారీ బోయపాటితో చేసిన సినిమాలు రెండూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ సారి కూడా అదే జరిగింది. అఖండ అద్భుత విజయం అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రం ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా ఉందనే చెప్పాలి. మరి అలాంటి సినిమా ఇచ్చిన బాలయ్య-బోయపాటి కాంబో గురించి మరింత హ్యాపీగా సంబురాలు చేసుకోవాలని కానీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటనే డౌట్ చాలామందికి వస్తుంది కదా..? కానీ ఇక్కడ మేటర్ సినిమా సాధించిన విజయం గురించి కాదు. సినిమాలోని డైలాగ్స్ గురించి. యస్.. బాలయ్య-బోయపాటి సినిమా అంటే పొలిటికల్ డైలాగ్స్ డైనమేట్స్ లా పేలతాయి. ఈ సారి కూడా అధికార ప్రభుత్వంపై అలాంటి డైలాగ్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేసిన బాలయ్య అండ్ తెలుగుదేశం పార్టీ అభిమానులకు అవేవీ కనిపించకపోవడంతో కోపం వచ్చింది. దీంతో బోయపాటితో పాటు రచయిత రత్నంపైనా వారు ఆగ్రహంగా ఉన్నారు. నిజానికి బాలయ్య కూడా ఇలాంటి పవర్ ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నప్పుడు తన ఇమేజ్ కు తగ్గట్టుగానే పొలిటికల్ గానూ గెయిన్ అయ్యే డైలాగ్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రంలోనూ అలాంటి అవకాశం ఉంది. అయినా వాడుకోకపోవడంతో బాలయ్య కూడా జగన్ కు భయపడ్డాడా అన్న స్థాయిలో ఉంది అభిమానుల ఆగ్రహం.
సినిమాలో పొలిటికల్ గా టచ్ అయ్యే డైలాగ్ ఒక్కటే ఉంది. ‘అంచనా వెయ్యడానికి నువ్వేమన్నా పోలవరం డ్యామా .. పట్టిసీమ తూమా’అనేది మాత్రమే ఆ డైలాగ్. అంతకు మించి ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క సెటైర్ కూడా డైలాగ్స్ లేదు. దీంతో ఈ విషయంలో చాలా డైలాగ్స్ ను ఎక్స్ పెక్ట్ చేసిన అభిమానులు నిరాశపడ్డారు. అవకాశం ఉన్నా.. విమర్శించడానికి భయపడ్డ బాలయ్య-బోయపాటిలపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. మరి ఈ ఆగ్రహానికి బోయపాటి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి.

Related Posts