పుష్ప ప్రీ రిలీజ్ కు మోక్షజ్ఞతో కలిసి బాలయ్య..

సినిమా పరిశ్రమలో ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే ఇలాగే ఉంటాయి మరి. బాలకృష్ణ అఖండ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు అల్లు అర్జున్. అది ఆ ఫంక్షన్ కే కాక సినిమాకు కూడా కొత్త ఊపు తెచ్చింది. ఇవాళ అఖండ అద్భుత విజయం సాధించింది. ఈ విషయాన్ని చాలామంది హీరోలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా. ఇప్పటి వరకూ ఇండస్ట్రీ ఎదురుచూసిన ఊపు ఇదే. అఖండ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. 2021లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అఖండకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ రుణం తీర్చుకునే టైమ్ రాబోతోంది. అందుకు మొదటి వేదిక ‘పుష్ప’ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబోతోంది.
విశేషం ఏంటంటే.. అఖండ సినిమా బోయపాటి బాలయ్య కాంబోలో వచ్చిన మూడో సినిమా. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప కూడా వీరికి మూడోదే. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే పుష్ప కూడా అఖండ విజయం సాధిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ నెల 17న విడుదల కాబోతోన్న పుష్ప ట్రైలర్ ను ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయంటున్నారు. అందులో భాగంగా ఐకన్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూసేది పుష్ప ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమే. ఈ ఫంక్షన్ కు ఈ సారి నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీతో కలిసి అటెండ్ అవుతున్నాడని సమాచారం. బాలయ్య భార్య వసుంధరతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అవుతారని టాక్. ఒక్కసారి డేట్ ఫిక్స్ అయితే ఆ తర్వాత ఈ తండ్రి కొడుకుల ఫ్లెక్సీస్ కూడా రెడీ చేయబోతున్నారు పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులు. ఏదేమైనా తెలుగు సినిమా పరిశ్రమలో ఇదేం కొత్త సంప్రదాయం కాదు కానీ.. నందమూరి, అల్లు వారి బంధం మాత్రం కొత్తగా కనిపిస్తోంది.

Related Posts