MAHESH BABU :- మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్డేట్ ..

టాలీవుడ్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయ్…వాటిల్లో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబో ఒకటి. వీరిద్దరూ గతంలో అతడు, ఖలేజా చిత్రాలు చేశారు. అతడు మూవీ మంచి విజయాన్ని సాధించింది. అన్నింటికి మించి ఓవర్సీస్ మార్కెట్ లో తెలుగు సినిమాలకు క్రేజ్ ని పెంచిన మూవీ కూడా అతడు సినిమానే. అప్పటి నుంచి టాలీవుడ్ మేకర్స్ ఓవర్సీస్ లో అది కూడా అమెరికా మార్కెట్ మీద ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేశారు. అతడు తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తోనే త్రివిక్రమ్, మహేష్ కలసి ఖలేజా మూవీ చేశారు. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ధియేటర్లలో నిరాశపరిచింది. కానీ మహేష్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్ తో ఖలేజా బుల్లితెర మీద జెమినీ టివిలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా జెమినిలో టెలికాస్ట్ అవుతుందంటే మొత్తం సినిమా చూసే ఆడియన్స్ ఉన్నారు.
పన్నెండేళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్, మహేష్ కాంబోలో సినిమా సెట్ అయ్యింది. ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా హారికా హాసినీ సంస్థలో చినబాబు నిర్మించబోతున్నారు. కొన్నాళ్ళ క్రితమే ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినా… మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండటంతో ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. త్రివిక్రమ్ అండ్ టీమ్ ఆల్ రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు. సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేయగానే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయ్యిందంటున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక త్రివిక్రమ్, మహేష్ ప్రాజెక్ట్ ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మూడు లేదా నాలుగు ఐదు తేదీల్లో లాంచనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేస్తారనే న్యూస్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. మహేష్ తో పూజాకి రెండో సినిమా ఇది. అలాగే త్రివిక్రమ్ తో మూడో సినిమా. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించనుందనే టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తంగా మహేష్, త్రివిక్రమ్, పూజా హెగ్డే కాంబోలో రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం టాలీవుడ్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

Related Posts