మీనా ఫ్యామిలీ మొత్తాన్ని ఎటాక్ చేసిన కరోనా

నిన్నటి తరం గ్లామర్ హీరోయిన్ మీనా ఫ్యామిలీకి కరోనా సోకింది. యస్.. గత రెండు వేవ్స్ లో మీనాకు కానీ తన ఫ్యామిలీకి కానీ ఈ సమస్య రాలేదు. కానీ ఈ సారి తను తప్పించుకోలేకపోయింది. నిజానికి ఇప్పుడు కరోనా ఉదృతి పెరుగుతోంది. కానీ ఈ విషయంలో ఇంకా మనవాళ్లు అలెర్ట్ కాలేదు. అందుకే రోజురోజుకూ కేస్ లు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి.
ఇక రీసెంట్ గా రజినీకాంత్ అన్నాత్తే సినిమలో అతని మరదలి పాత్రలో కనిపించింది మీనా. అలాగే వెంకటేష్ సరసన దృశ్యం2లోనూ ఆకట్టుకుంది. కొన్నాళ్లుగా తనేమీ షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేయలేదు. అయినా తన ఫ్యామిలీకి కరోనా సోకడం విషాదం. అయితే ఈ విషయాన్ని మీనా ఫన్నీగా తెలియజేయడం విశేషం. ‘2022లో మా ఇంటికి మొదటి విజిటర్ గా వచ్చింది కరోనా. ఇది మా కుటుంబం మొత్తాన్ని నచ్చింది. కానీ నేను తనను ఇక్కడే ఉండనివ్వను. జాగ్రత్త. అందరూ సేఫ్ గా హెల్దీగా ఉండండి. కరోనా వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ఇక మా కుటుంబం కోసం ప్రార్థిస్తారు కదూ’ అంటూ రాసుకొచ్చింది మీనా.
మీనాతో పాటు ఆమె భర్త విద్యాసాగర్, కూతురు(తెలుగులో పోలీసోడుగా వచ్చిన విజయ్ సినిమాలో అతని కూతురుగా నటించింది ఈ పాప) నైనిక, అత్త రాజమల్లికకు సైతం పాజిటివ్ గా తేలిందట. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్న మీనా ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.

Related Posts