ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించడం.. సినీ ప్రముఖులు టిక్కెట్ల రేట్లను పెంచాలని విజ్ఞప్తి చేయడం తెలిసిందే. వివాదస్పదమైన ఈ విషయం గురించి చర్చించడానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఈరోజు సమావేశమైంది. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం ప్రేక్షకుల సంఘం తరుపున హజరైన కమిటీ సభ్యురాలు లక్ష్మీ మీడియాతో మాట్లాడారు.
జీవో 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి చెప్పామని.. థియేటర్లో సదుపాయాలు సరిగా లేకపోవడం పై కూడా చెప్పామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టిక్కెట్ల ధరలు పెంచాలని చెప్పామని తెలియచేశారు. ఎగ్జిబ్యూటర్స్ తరుపున హాజరైన సభ్యుడు బాలరత్నం మాట్లాడుతూ.. టిక్కెట్ ధరల తగ్గింపుతో రాష్ట్రంలో దాదాపుగా 200 థియేటర్ల మూతపడిన విషయం కమీటి దృష్టికి తీసుకెళ్లాం. థియేటర్ల నిబంధనల విషయంలో కొంత వెసులబాటు కల్పించాలని కోరామని చెప్పారు. బి,సి సెంటర్స్ లో రేటు మార్పు చేయాల్సివుందని మరో సభ్యుడు ముత్యాల రాందాస్ చెప్పారు. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…