బాల‌య్య స‌ర‌స‌న ఆనాటి హీరోయిన్. స‌క్సెస్ ఫుల్ కాంబో రిపీట్

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. స‌రికొత్త రికార్డులు సృష్టించారు. ఇక త‌దుప‌రి చిత్రాన్ని క్రాక్ సినిమాతో స‌క్స‌స్ సాధించిన మ‌లినేని గోపీచంద్ తో చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సినిమాలో బాలయ్య డ్యూయ‌ల్ రోల్ ప్లే చేస్తున్నారట‌. అందులో ఒకటి ఫ్రాక్షనిస్టు పాత్ర కాగా, రెండవది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని స‌మాచారం. అయితే.. ఇద్దరూ అన్నదమ్ములు కారు తండ్రీ కొడుకులు అని టాక్ వినిపిస్తోంది. కొడుకు పాత్రకు జోడీగా శృతిహాసన్ ని ఇప్పటికే ఎంపిక చేశారు. తండ్రి పాత్రలో బాలయ్య పక్కన నటించే హీరోయిన్ గా సీనియ‌ర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేశార‌ని ప్రచారం జ‌రుగుతుంది. విజయశాంతి ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు.

ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీ తరువాత విజ‌య‌శాంతి మరే సినిమాలో న‌టించ‌లేదు. ఆ మధ్యన మెగాస్టార్ మూవీలో కూడా విజయశాంతి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత‌ అది రూమరే అని తెలిసింది. అలాంటిది ఇపుడు బాల‌య్య‌తో న‌టించేందుకు ఓకే చెప్పింద‌ని ప్రచారం జ‌రుగుతుంది. బాల‌య్య‌, విజయశాంతి కలసి ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించారు. మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూడాల‌నుకుంటున్నారు అభిమానులు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Posts