మాస్ హీరో అంటేనే అభిమానులను అలరించేలా డైలాగులు చెప్పాలి.. కుర్రకారును ఉర్రూతలూగించేలా డ్యాన్సులు వేయాలి.. ఫైట్స్ చేయాలి. అలాంటి క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అందుకే.. టాలీవుడ్ లో నటసింహం ను అసలుసిసలు మాస్ హీరో అంటుంటారు. ఇక.. బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింత పీక్స్ లో చూపించబోతున్నాడట డైరెక్టర్ బాబీ. ఎన్.బి.కె.109 కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా బాలకృష్ణ సరసన ముగ్గురు భామలు నటించబోతున్నారట.
చిరంజీవితో బాబీ తీసిన ‘వాల్తేరు వీరయ్య‘లో బాస్ పార్టీ సాంగ్ లో అదరగొట్టింది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. ఇప్పుడా ముద్దుగుమ్మ ఎన్.బి.కె.109 లోనూ నటిస్తుందట. ఈ సినిమాలో బాలయ్యతో చిందులు వేయడమే కాకుండా.. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ సందడి చేయనుందట. టాలీవుడ్ లో ప్రెజెంట్ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మరో నాయికగా నటించనుందట. వీరిద్దరితో పాటు ఓ సీనియర్ హీరోయిన్ కి కూడా ఈ చిత్రంలో చోటున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో త్రిష కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తంమీద.. తన 109వ సినిమాకోసం ముచ్చటగా ముగ్గురు భామలతో చిందులేయనున్నాడట నటసింహం బాలకృష్ణ.
'ఫ్యామిలీ స్టార్' తర్వాత మళ్లీ దిల్రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'రాజావారు రాణిగారు' ఫేమ్…
వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోకుండా.. సెలక్టివ్ గా సినిమాలు చేసే ముద్దుగుమ్మ సాయిపల్లవి. హీరోయిన్ గా అగ్రపథాన దూసుకెళుతోన్న సమయంలోనే…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో 80 నుంచి 90 శాతం మంది వారసత్వంగా వచ్చినవారే. అంతటి…
ప్రస్తుతం జోరుగా సాగుతోన్న రీ రిలీజుల ట్రెండ్ లో విక్రమ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'అపరిచితుడు' కూడా చేరింది.…
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…