రాధేశ్యామ్ విషయంలో కావాలనే దాస్తున్నారా..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ సినిమా వస్తోందంటే ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. బాహుబలి తర్వాత కంట్రీ మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. బాహుబలి నుంచి అతనికి నార్త్ లో ఫ్యాన్ బేస్ ఊహించని విధంగా పెరిగింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ ను అందరూ ఇండియాస్ సూపర్ స్టార్స్ లో ఒకడుగా చెబుతున్నారు. అంటే అతని రేంజ్ టాలీవుడ్ ను కూడా దాటేసింది. మరి అలాంటి హీరో నుంచి సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ తో పాటు పరిశ్రమలోనూ ఎలాంటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. బట్ ఆ అంచనాలను అందుకోవడంలో సాహో ఫెయిల్ అయింది. కమర్షియల్ గా ఎంత కలెక్ట్ చేసినా.. కంటెంట్ పరంగా చాలా వీక్ అనిపించుకుందీ చిత్రం. సాహో ఓ రకంగా ప్రభాస్ కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ షాక్ మళ్లీ తగలకూడదనే ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో లో ప్రొఫైల్ మెయిన్టేన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది.
సాహో.. బాహుబలి తర్వాత వస్తోన్న సినిమా కావడం.. ట్రైలర్ లోనే యాక్షన్ ఓ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉంటుందనేలా హైప్ క్రియేట్ చేశారు. దీంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. తీరా సినిమా వచ్చాక చూస్తే.. తెలుగులో ఆల్రెడీ వచ్చి డిజాస్టర్ అనిపించుకున్న అజ్ఞాతవాసినే అటూ ఇటూ తిప్పి వదిలారు. దీంతో సౌత్ లో పోయింది. నార్త్ లో ఓకే అనిపించుకుంది.
సాహో చేదు అనుభవం మళ్లీ రిపీట్ కావొద్దనే.. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో భారీ అంచనాలు పెంచడం లేదనే కమెంట్స్ వస్తున్నాయి. సినిమాలోని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ విడుదల తర్వాత డైరెక్ట్ గా ఎక్స్ పీరియన్స్ చేస్తే ఆశ్చర్యపోతారు ఆడియన్సెస్ అనేది మేకర్స్ భావనగా చెబుతున్నారు. మరి ఇది నిజమా కాదా అనేది పక్కన బెడితే.. ఇప్పటికీ సినిమాపై అంచనాలు పెరగ లేదనేది వాస్తవం. అంటే మరీ లో ప్రొఫైల్ అంటే అంచనాల మాట అటుంచితే అసలు ఆసక్తి అయినా పెరగాలి కదా..? పెంచకపోతే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుంది కదా అనేది మరికొందరి వాదన. మరి ఇద్దరిలో ఎవరు రైట్ అనేది సంక్రాంతి బరిలో జనవరి 14న తేలిపోతుంది.

Related Posts