నటసింహం నందమూరి బాలకృష్ణ ఎనర్జీని ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను. వీరి కలయికలో వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ’ చిత్రాలు ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా అద్భుతమైన విజయాలు సాధించాయి. వీరి కలయికలో ఈ సారి డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడుతూ కొత్త సినిమా రూపొందనుందనే ప్రచారం కొన్నాళ్లుగా జోరందుకుంది.
‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ గా బాలకృష్ణతో ‘అఖండ 2’ తెరకెక్కించబోతున్నానని గతంలోనే ప్రకటించాడు బోయపాటి. లేటెస్ట్ గా మరోసారి ‘అఖండ 2’పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫస్ట్ పార్ట్ తరహాలోనే డివైన్ ఎలిమెంట్ తో ‘అఖండ 2’ రూపొందుతుందని క్లారిటీ ఇచ్చాడు బోయపాటి. ప్రస్తుతం బాలకృష్ణతో చేయబోయే ‘అఖండ 2’కి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఒక సినిమా చేయబోతున్నాడు. మరి.. గీతా ఆర్ట్స్ లో చేయబోయే సినిమా ఏంటి? హీరో ఎవరు? అనే దానిపైనా ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక.. నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలాభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ నుంచి ఆమధ్య రిలీజైన గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుండడంతో ఈ మూవీ షూట్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడట బాలయ్య. మళ్లీ జూన్ నుంచి బాబీ సినిమా తిరిగి పట్టాలెక్కనుందట.
ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది. దేశంలోనే రెండో…
ప్రస్తుతం మన స్టార్ హీరోలంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకేసారి రెండేసి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మాత్రమే కాదు.. అప్పుడప్పుడూ వాయిస్ ఓవర్ తోనూ ఆడియన్స్…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్యాక్ టు…
బాలీవుడ్ పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక సతమతమైన హిందీ చిత్ర పరిశ్రమ.. గత ఏడాది…
దాదాపు 37 ఏళ్ల తర్వాత విశ్వ నటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం…