పుష్ప 2: ది రూల్ బడ్జెట్ పెరుగుతోంది..అయినా తగ్గేదే లే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సినిమా పుష్ప 2: ది రూల్. పుష్ప 1: ది రైజ్ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ మూవీ బడ్జెట్ అనుకున్నదానికంటే బాగా పెరిగిపోతుందట. పార్ట్ 1 కి ఇలాగే బడ్జెట్ పెరిగింది. అయినా సుకుమార్ బృందం ఏమాత్రం తగ్గకుండా రిచ్‌గా సినిమాను తీసి పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్ళతో సక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు పుష్ప: ది రూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగ జాత‌ర సీక్వెన్స్ ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్స్ కోసం ఏకంగా 40 నుంచి 50 కోట్ల వరకు ఖ‌ర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్ప: ది రూల్ మేకర్స్ అనుకున్న బడ్జెట్ రూ.200 కోట్ల‌ట. కానీ, అంతకు మించి ఖర్చు చేస్తున్నట్టుగా తాజా సమాచారం.

అయితే పుష్ప పార్ట్ 1 సక్సెస్ కారణంగా ఈ సీక్వెల్ పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. బిజినెస్ పరంగానూ ఇప్పటికే సాలీడ్ ఆఫర్స్ వస్తున్నాయట. అందుకే, ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ పుష్ప: ది రూల్ ని నిర్మిస్తున్నారట. పుష్ప: ది రైజ్ తో నేషనల్ అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్, ఈ మూవీతో కూడా మరోసారి నేషనల్ అవార్డ్ అందుకోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఆ విధంగా మూవీ కోసం కష్టపడుతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మాణం.

Related Posts