ధూత ట్రైలర్ రిలీజ్..తప్పు చేస్తే ఎవరు ప్రశిస్తారు..? అంటున్న నాగ చైతన్య..

నేడు (23.11.2023) అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన వెబ్ సిరీస్ ‘ధూత’ నుంచి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘138 కోట్ల మంది జనాలను కాపాడుతున్న ఈ జుడీషియల్ సిస్టమ్, పొలిటీషియన్స్ అండ్ పోలీసులు..తప్పు చేస్తే వీరిని ఎవరు ప్రశ్నిస్తారు..? అంటూ మొదలైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెట్‌తో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ‘ధూత’ వెబ్ సిరీస్ ని రూపొందించారు.

నాగ చైతన్యకి ఇది మొదటి వెబ్ సిరీస్. ఎప్పుడో స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎట్టకేలకి అమెజాన్ ప్రైమ్ లో ‘ధూత’ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈరోజు నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ‘ధూత’ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం కీలక పాత్రలు పోషించారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి రాబోతుంది.

Related Posts