ఏప్రిల్ నుంచి పట్టాలెక్కనున్న మలినేని – మైత్రీ మూవీ

మాస్ మహారాజ రవితేజ, మలినేని గోపీచంద్ కాంబోలో ఆమధ్య ఓ సినిమాని ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఒకవేళ ఇది పట్టాలెక్కితే రవితేజ, మలినేని కాంబోలో నాల్గవ చిత్రమయ్యేది. అయితే.. అనివార్య కారణాలతో ఆ ప్రాజెక్ట్ ను ఆపేసింది మైత్రీ సంస్థ. ఇదే సమయంలో అదే మలినేని గోపీచంద్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఓ సినిమాకి శ్రీకారం చుట్టింది.

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సన్నీ డియోల్ ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. పోయినేడాది ‘గదర్ 2‘తో వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు కలెక్షన్లను కొల్లగొట్టాడు సన్నీ డియోల్. మలినేని గోపీచంద్ రెడీ చేసిన స్టోరీ పాన్ ఇండియా టచ్ తో ఉండడంతో.. సన్నీ డియోల్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముహూర్తాన్ని జరుపుకుని.. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. మొత్తం హైదరాబాద్ లోనే ఈ సినిమా చిత్రీకరణ జరుపుకునేలా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేస్తున్నాడట డైరెక్టర్ మలినేని గోపీచంద్.

Related Posts