సూపర్ స్టార్ మహేష్ బాబు తలచుకుంటే కార్లకు కొదవా. పైగా టాలీవుడ్ లోని రిచెస్ట్ యాక్టర్స్ లో అతనూ ఒకడు. అయితే కార్ అంటే అతనే కాదు. చాలామంది కొంటారు. ఆ చాలామందిలో కూడా కొంత స్పెషల్ గా ఉండాలంటే కాస్త యూనిక్ గా ఆలోచించాలి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి కార్ ఉన్న ఏకైక హీరో మహేష్ మాత్రమే అనిపించుకుంటున్నాడు. యస్.. లేటెస్ట్ గా మహేష్ బాబు బ్రాండ్ న్యూ రేంజ్ రోవర్ ఎస్.వి కార్ కొన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ లో రేంజ్ రోవర్ కార్లుచాలమందికే ఉన్నాయి. అయితే మహేష్ కార్ స్పెషాలిటీ ఏంటంటే.. కలర్. గోల్డ్ కలర్ కార్ ఇది. హైదరాబాద్ లో ఈ కలర్ లో ఉన్న ఏకైక రేంజ్ రోవర్ మహేష్ బాబుకు మాత్రమే సొంతమైంది.
ఈ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కార్ ధర 5 కోట్ల 40లక్షలు. షాకింగ్ గా ఉంది కదూ. అంతే మరీ లక్జూరియస్ లైఫ్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు ఉంటుంది. ఇక తెలుగులో ఈ కార్ ఉన్న హీరోలు చాలామందే ఉన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మెగాస్టార్, రామ్ చరణ్, నితిన్ తో పాటు నాగ శౌర్యకు కూడా రేంజ్ రోవర్ ఉంది. అందుకే వీరికి కాస్త భిన్నంగా ఉండాలనే హైదరాబాద్ లోనే ఫస్ట్ గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ను సొంతం చేసుకున్నాడు మహేష్బాబు.
ఇక సినిమాల పరంగా చూస్తే ఈ శనివారం నుంచి మహేష్ బాబు గుంటూరు కారం మూవీ సెట్స్ లో జాయిన్ అవుతున్నాడు. కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ మూవీ షెడ్యూల్ కొత్త స్టార్ట్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందుతోన్న గుంటూరు కారంలో శ్రీ లీల హీరోయిన్. మరో హీరోయిన్ కోసం చూస్తున్నారు. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా మొదలైన ఈ మూవీ ఆ దిశగానే షెడ్యూల్స్ జరుపుకుంటోంది.