తెలుగు చిత్ర పరిశ్రమలో వైజయంతీ మూవీస్ ది ఎంతో ప్రత్యేక స్థానం. దాదాపు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోన్న వైజయంతీ నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజులో రాబోతున్న చిత్రం ‘కల్కి 2898 ఎడి‘. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు.. విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తుంది.
ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘కల్కి 2898 ఎడి‘ మూవీని ఈ ఏడాది మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. మే 9.. వైజయంతీ సంస్థకు సెంటిమెంట్ డేట్. గతంలో ఇదే డేట్ కి ఇదే సంస్థ నుంచి వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి‘ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే ‘కల్కి‘ని ఈ ఏడాది మే 9కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కాస్త విరామం తర్వాత మళ్లీ ఈరోజు నుంచే ‘కల్కి‘ షూటింగ్ షురూ అయ్యిందట.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటింగ్ 'దేవర' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. 'ఫియర్' అంటూ సాగే ఈ…
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…