ఓటిటికి ఆదిపురుష్‌ ..

ప్రభాస్, కృతి సనన్ రాఘవ్, జానకిలుగా నటించిన సినిమా ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రభాస్ ఇమేజ్ వల్ల 400 కోట్లు వరకూ కలెక్ట్ చేసింది కానీ.. కంటెంట్ పరంగా దేశవ్యాప్తంగా అభాసుపాలయింది.

ఇంత దారుణమైన రామాయణ కథను వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనా ఇప్పటి ఎవరూ తీయలేదు అన్న విమర్శలు ఎదుర్కొంది. పాత్రల తీరు, వాటి ఔచిత్యం విషయంలో దర్శకుడికి మినిమం అవగాహన లేదనేది మొదటి ఆటకే తేలిపోయింది. పైగా కేవలం నార్త్ లో కొంత మంది పిలుచుకునే పేర్లు మాత్రమే పెట్టడంతో సౌత్ లో ఎవరికీ నచ్చలేదు కూడా.

ఇక రావణ పాత్ర విషయంలో కంట్రీ మొత్తం కామెంట్స్ వచ్చాయి. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందింది అని చెప్పుకుంటోన్న ఈ మూవీ ఆ బడ్జెట్ ను రికవర్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. ఇంకా చెబితే మొదటి మూడు రోజులు తప్ప తర్వాత రోజురోజుకూ కలెక్షన్స్ పరంగా దిగజారుతూనే ఉంది. అందుకే విడుదలకు ముందు భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని ఇక ఓటిటిలో వదిలేందుకు ముహూర్తం రెడీ అయింది.


మామూలుగా ఓ పెద్ద స్టార్ నటించిన సినిమా ఇంత త్వరగా ఓటిటికి రావడం ఆశ్చర్యమే. అయినా ఆదిపురుష్‌ కు వచ్చిన ఆదరణ చూసిన తర్వాత ఇక థియేటర్స్ ల ఆశలు వదులుకుని ఓటిటిలో వదులుతున్నారు.

మరి ఈ చిత్రం ఓటిటిలో ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా..? ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఆదిపురుష్ ఓటిటికి వస్తోంది. మరి ఇప్పటి వరకూ థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటిటిలో మెప్పించాయి. ఆ సెంటిమెంట్ ను ఆదిపురుష్‌ కూడా రిపీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

Related Posts