బాహుబ‌లి 3 గురించి ప్ర‌భాస్, రాజ‌మౌళి ఏమ‌న్నారో తెలుసా.?

ప్ర‌భాస్, రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. బాహుబ‌లి 2 సినిమా 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. అంతే కాకుండా.. 1000 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసిన తొలి భార‌తీయ సినిమాగా చ‌రిత్ర సృష్టించింది. బాహుబ‌లి ఇండియాలోనే కాకుండా అమెరికా, చైనా, జ‌పాన్..ఇలా విదేశాల్లో కూడా విజ‌యం సాధించ‌డం విశేషం.

ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. దర్శకుడిగా రాజమౌళి కీర్తిప్రతిష్ఠలు ఆకాన్నంటాయి. మరో వైపు బాహుబలి పార్ట్ 3 వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. బాహుబలి -3 గురించి ఇటీవల రాధే శ్యామ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ మాట్లాడుతూ… బాహుబ‌లి పార్ట్ 3 గురించి తనకు తెలియదని, సమయం వచ్చినప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పాడు. అంతే కాకుండా రాజ‌మౌళి త‌లుచుకుంటే అవుతుంద‌న్నారు.

తాజాగా బాహుబలి – 3 గురించి రాజమౌళి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ జ‌క్క‌న్న ఏం చెప్పారంటే.. బాహుబ‌లి పార్ట్ 3 తప్పకుండా వస్తుంది. బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ఈసారి ప్రేక్షకులకు చూపిస్తామని చెప్పారు. మూడో పార్ట్ కు సంబంధించి వర్క్ చేస్తున్నామని తెలిపారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా బాహుబ‌లి 3 తీసేందుకు సుముఖంగా ఉన్నారని అయితే.. ఈ సినిమా రావడానికి టైమ్ ప‌డుతుంద‌న్నారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి మ‌హేష్ తో మూవీ చేయ‌నున్నారు. మ‌రి.. ఆత‌ర్వాత బాహుబ‌లి 3 ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Related Posts