రెండు ప్లాప్స్ నుంచి త‌ప్పించుకున్న వెంకీ.

ఒక హీరో కోసం క‌థ రాస్తే.. మ‌రో హీరోకి ద‌గ్గ‌ర‌కి వెళ్ళ‌డం అనేది సినిమా ఇండస్ట్రీలో కామ‌న్. ఒక హీరో నో చెప్పిన క‌థ స‌క్స‌స్ అయితే.. ఆ సినిమా తిర‌స్క‌రించిన హీరోలు బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ మిస్ అయినందుకు ఫీల‌వుతారు. ఒక‌వేళ వాళ్లు రిజెక్ట్ చేసిన సినిమా డిజాస్ట‌ర్ అయితే.. ఆ హీరో స‌రైన నిర్ణ‌యం తీసుకున్నాను అనుకుంటారు. ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేష్ విష‌యం అదే జ‌రిగింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ప్రస్తుతం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ డివైడ్ టాక్ తెచ్చుకున్న రాధేశ్యామ్ మూవీ స్టోరీ ముందుగా వెంక‌టేష్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈ సినిమా క‌థ‌ను వెంక‌టేష్ కి చెప్ప‌డం జ‌రిగింది. అయితే.. వెంకీ ఈ క‌థ న‌చ్చ‌లేద‌ని ఎలాంటి మొహ‌మాటం లేకుండా చెప్పేశాడు. ఆత‌ర్వాత ఆ క‌థ‌ను చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ప‌క్క‌న‌పెట్టేశారు. అయితే.. ఆ క‌థ‌ను తీసుకుని రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ మూవీ తీసారు. ఇక వెంకి త‌ప్పించుకున్న మ‌రో సినిమా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు.

దర్శకుడు కిషోర్ తిరుమల ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే క‌థ‌ను ముందుగా వెంక‌టేష్ కి చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. అంతే కాకుండా… ఈ సినిమాని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం కూడా జ‌రిగింది కానీ.. కొన్ని కారణాల వల్ల వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గాడు. చివరికి కిషోర్ తిరుమ‌ల‌ ఆ సినిమా క‌థ‌ను శర్వానంద్ కి చెప్ప‌డం జ‌రిగింది. ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రం గత వారం విడుద‌లైంది. ఏమాత్రం ఆక‌ట్టుకోకుండా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా.. వెంకీ రెండు ప్లాప్ చిత్రాల నుంచి తెలివిగా త‌ప్పించుకున్నారు. అదీ.. సంగ‌తి.

Related Posts