ప్యాన్ ఇండియన్ స్టార్ అనే ట్యాగ్ కోసం దూసుకుపోతున్నాడు నిఖిల్. కార్తికేయ2 ఇచ్చిన సడెన్ హిట్ తో సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవచ్చు అనుకున్నాడు. ఆ ప్లానింగ్ లో భాగంగా వస్తోన్న సినిమానే ”స్పై”. గ్యారీ హెచ్.బి అనే దర్శకుడు రూపొందించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.
లార్జ్ స్కేల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అయితే మూవీలో ఓ కాంట్రవర్శీయల్ కంటెంట్ కూడా ఉంది. సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించబోతున్నాడట ఈ స్పై. ఇప్పటి వరకూ ఈ ప్రయత్నం ఎవరూ చేయలేదు.
అయితే భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు. దీంతో ఆయన బతికే ఉన్నాడని ఎన్నో కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిలో ఒకటి బోస్ సోవియట్ యూనియన్ కు బందీగా ఉండగా సైబీరియాలో మరణించాడని. దీనిపై విచారణ చేసి నిర్ధారణ చేయడం కోసం భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది.
1956 మే నెలలో నలుగురు సభ్యులతో కూడిన షానవాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్ వెళ్ళింది. అప్పట్లో భారత్ కు తైవాన్ తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారు సహకరించలేదు. కానీ 1999-2005 లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోసు ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్థారణకు వచ్చింది. విశేషం ఏంటంటే అమెరికా కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్ కు లేఖను పంపడం జరిగింది.
ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005 ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదనీ, రెంకోజీ గుడిలో ఉన్నది ఆయన చితాభస్మం కాదని తేలింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది..
ఇదీ ఇప్పటి వరకూ బోస్ మరణానికి సంబంధించి జనాలకు తెలిసిన విషయాలు. అయితే స్పై మూవీలో మాత్రం అంతకు మించిన రహస్యాలను ఛేదించబోతున్నారు అనే కలరింగ్ ఇస్తున్నారు కానీ.. అవేవీ నిజం కాదట. ఇంకా చెబితే ఈ సినిమాలో బోస్ కు సంబంధించిన ఎపిసోడ్ ఏమంత ఆసక్తికరంగా ఉండదు అంటున్నారు. ప్రస్తుతం ఒక వర్గానికి అనుకూలంగా ఉండేలానే ఈ కథనం కూడా ఉంటుందని టాక్. ఆ మేరకు సినిమాపై ఆసక్తిని పెంచడానికి తప్ప.. బోస్ ఎపిసోడ్ సినిమాలో పెద్దగా ఉండదు అంటున్నారు.
అంతే కాక.. స్క్రీన్ ప్లే కూడా గొప్పగా లేదనే టాక్ ఉంది. మరోవైపు బోస్ అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ బోస్ కాదని.. సినిమాలో నిఖిల్ కు సోదరుడుగా నటించిన వ్యక్తి పేరు బోస్ అని.. అతను కూడా రా ఏజెంట్ అనీ.. ఒక ఆపరేషన్ లో చంపేస్తే అతన్ని వెదుకుతూనే తమ్ముడు కూడా వెళతాడు అనే మరో కథనం కూడా వినిపిస్తోంది.
మొత్తంగా చూస్తే నిఖిల్ ఉత్సాహపడుతున్నంత గొప్ప కంటెంట్ ఈ సినిమాలో అయితే లేదనే టాక్ బలంగా ఉంది. ఈ స్పై మూవీలో ఆ జానర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేంత స్టఫ్ అయితే లేదనే అంటున్నారు. అది నిజమా కాదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…