SSMB 29 : మహేష్ బాబు కు విలన్ ఎవరు..?

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్స్ లో ఒకటి రాజమౌళి – మహేష్‌ బాబు. ఈ ఇద్దరి కలయికలో సినిమా కోసం దాదాపు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ పదేళ్లలో రాజమౌళి తీసింది మూడు సినిమాలు మాత్రమే. ఈ మూడిటితోనే అతను అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ రాజమౌళి ఇమేజ్ ను శిఖరాలకు తీసుకువెళ్లింది.

దీంతో ఇప్పుడు మహేష్‌ బాబు సినిమా కూడా ఆటో మేటిక్ గా ఆ రేంజ్ కు వెళుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఆల్రెడీ కథకు సంబంధించిన వర్క్స్ అన్నీ అయిపోయాయి. ప్రస్తుతం మహేష్‌ బాబు .. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ యేడాది అక్టోబర్ వరకూ పూర్తవుతుంది అంటున్నారు.

ఆ తర్వాత రాజమౌళి సినిమా పట్టాలెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో విలన్ గా ఎవరిని తీసుకోవాలి అనే పెద్ద ప్రశ్న రాజమౌళి ముందు ఉంది. అయితే అతనికి ఓ హీరోను తన సినిమాలో తీసుకోవాలనే బలమైన కోరిక కొన్నేళ్లుగా ఉంది.

కానీ కుదరడం లేదు. మరి అతను వస్తాడా లేక బాలీవుడ్ హీరో వస్తాడా అనేది ఆసక్తిగా మారింది. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ను మహేష్‌ కు విలన్ గా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనే కమెంట్స్ వస్తున్నాయి. ఆమిర్ ఖాన్ రీసెంట్ మూవీ లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో అతను పూర్తిగా ఖాళీ అయిపోయాడు.

ఇప్పటి వరకూ వేరే ఏ ప్రాజెక్ట్ కూ కమిట్ కాలేదు. ఇది వైరాగ్యమా లేక గ్యాప్ తీసుకుంటున్నాడా అనేది తెలియదు.బట్ రాజమౌళి సినిమాకు ఓకే చెబితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు నెక్ట్స్ లెవెల్ వాల్యూ యాడ్ అవుతుంది. అయితే రాజమౌళికి చాలా కాలంగా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ తో పనిచేయాలనే కోరిక ఉంది. ఆయన్ని మగధీర నుంచి తన ప్రాజెక్ట్ లో భాగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకూ కుదరలేదు.

నిజానికి ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవ్ గణ్‌ చేసిన పాత్రను కూడా ఆయనకోసమే అనుకున్నాడు జక్కన్న. అప్పుడూ కుదరలేదు. దీంతో మహేష్‌ కోసం మరోసారి ప్రయత్నిస్తాడుఅనే ప్రచారం కూడా ఉంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు చేసినా ఈ మూవీకి ఓ రేంజ్ లో ప్లస్ అవుతుందని మాత్రం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నది మాత్రం ఆమిర్ ఖాన్ గురించి. మరి ఆమిర్ వస్తే అంతర్జాతీయంగానూ ప్రాజెక్ట్ క్రేజ్ డబుల్ అవుతుంది.

Related Posts