నాగ చైతన్యతో స్టార్ హీరోయిన్

నాగ చైతన్య కొత్త సినిమాకు ముహూర్తం రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన కస్టడీ ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. అంతకుముందు చేసిన థ్యాంక్యూ, లాల్ సింగ్ ఛద్దా కూడా పోవడంతో ప్రస్తుతం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్నాడు చైతన్య.

బట్ ఏ స్థితిలో అయినా కూల్ గా తన వర్క్ తను చేస్తూ ముందుకు వెళుతుంటాడు చైతన్య. కాకపోతే ఇలా ఫ్లాపులు వస్తున్నప్పుడు ఎవరైనా కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రిప్ట్ నచ్చడం వేరు. అది అలాగే సినిమాగా మారడం వేరు. ఈ రెండూ సమంగా ఉన్నప్పుడే రిజల్ట్ ఊహించినట్టుగా వస్తుంది. ఈ విషయంలోనే బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నాడు నాగ చైతన్య.


కస్టడీ తర్వాత అంతా పరశురామ్ తో సినిమా ఉంటుందనుకున్నారు. బట్ పరశురామ్ ను సర్కారు వారి పాట టైమ్ లోనే తను వదిలేసినట్టు ఇంతకు ముందు చెప్పాడు చైతన్య. ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకుని ఓ స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నట్టు గతంలోనే వార్తలు వచ్చాయి. కార్తికేయ2తో ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నెక్ట్స్ మూవీ రాబోతోంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోతోన్న ఈ మూవీ శ్రీకాకుళం సముద్రం చుట్టూ ఉండే మత్స్యకారుల నేపథ్యంలో ఉంటుందట. ఇంకా చెబితే ఇదో రియల్ స్టోరీ అంటున్నారు. దానికి సినిమాటిక్ కలర్స్ యాడ్ చేసిన ఓ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడట చందు.


ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కీర్తి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తనకు కథ వినిపిస్తే ఖచ్చితంగా ఓకే చెబుతుందనే నమ్మకంలో దర్శకుడితో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. కాకపోతే తనిప్పుడు తమిళ్ లో నటించిన మామన్నన్ అనే మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

ఆ ప్రమోషన్స్ తర్వాత కథ విని ఓకే చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. ఇంకా చెబితే తనకు లైన్ తెలుసట. కాకపోతే ఓ సారి పూర్తి కథ వింటే తనకూ ఓ ఐడియా ఉంటుంది కదా అనేది అసలు విషయం. ఒకవేళ కీర్తి సురేష్ ఓకే చెబితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కు వెయిట్ పెరుగుతుంది. పైగా చైతన్య, కీర్తి సురేష్ జోడీ ఫ్రెష్ గా బావుంటుంది కూడా.


ఇక చందు మొండేటి – నాగ చైతన్య కాంబోలో ఇంతకు ముందు ప్రేమమ్ వంటి బ్లాక్ బస్టర్ తో పాటు సవ్యసాచి అనే డిజాస్టర్ కూడా ఉంది. మరి ఈ డిజాస్టర్ ను మరిపించేలా ఈ కథ ఉంటుందని టాక్. సో.. నాగ చైతన్య – కీర్తి సురేష్‌ కాంబో అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు సినిమా ప్రారంభ తేదీని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు.

Related Posts