ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి.. ప్రపంచ రికార్డును నెలకొల్పి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. స్కిప్టుతో వస్తే.. ఫస్ట్ కాపీతో బయటకు వెళ్లేలా నిర్మాతల కోసం స్టూడియోని నిర్మించారు. ఎంతోమంది నూతన నటీనటులు, దర్శకులను చిత్రసీమకు పరిచయం చేసిన ఆయనే మూవీ మొఘల్ రామానాయుడు.
తొలుత మిత్రులతో కలిసి ‘అనురాగం’ సినిమాను నిర్మించిన రామానాయుడు.. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్ పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి తొలి ప్రయత్నంగా నటరత్న యన్టీఆర్ తో ‘రాముడు భీముడు’ సినిమాను నిర్మించారు. తాపీ చాణక్య దర్శకత్వంలో రూపొందిన ‘రాముడు భీముడు‘ మే 21, 1964లో విడుదలైంది. అంటే.. నేటికి సరిగ్గా ఈ సినిమా విడుదలై.. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 60 ఏళ్లయ్యింది.
1964లో ‘రాముడు భీముడు‘ సినిమాతో మొదలైన సురేష్ ప్రొడక్షన్స్.. ఈ అరవై ఏళ్లుగా ఎన్నో అత్యద్భుతమైన చిత్రాలను అందించింది. తొలి తరం నటులు యన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకొని కృష్ణ, శోభన్ బాబు వంటి రెండో తరం.. చిరంజీవి, వెంకటేష్ వంటి మూడో తరం హీరోలతోనూ సినిమాలను నిర్మించడమే కాకుండా.. నేటితరంలోని కొంతమంది కథానాయకులతో సినిమాలను నిర్మించిన ఘనత సురేష్ ప్రొడక్షన్స్ సొంతం.
ప్రభాస్ పట్టిందల్లా బంగారంలా మారుతుంది. రెబెల్ స్టార్ నుంచి సినిమా వస్తే.. కలెక్షన్ల సునామీ ఖాయం. అయితే.. ఒక సినిమా…
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోయే క్రేజీ సీక్వెల్స్ లో 'జై హనుమాన్' ఒకటి.…
'డార్లింగ్' ప్రభాస్ సినిమా టైటిల్ తో రూపొందుతోన్న ప్రియదర్శి చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్…
The film 'Game Changer' is being made by global star Ram Charan and director Shankar.…
Even as it enters the tenth day, the 'Kalki' collections continue to flourish all over…
సినిమాల సంఖ్యా పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ, స్టార్ స్టేటస్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఇండియాలోనే నంబర్ వన్ ఇండస్ట్రీగా…