రవితేజ రిలీజ్ చేసిన రూల్స్ రంజన్ సాంగ్

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రూపొందిన సినిమా రూల్స్ రంజన్. రత్నం కృష్ణ దర్శకుడు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మూడు పాటలూ ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా విడుదల చేశారు.


ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఎవరి చేతనైనా కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. “నువ్ పక్కనుంటే చిల్లు, తిరగొద్దే వాచు ముల్లు.. నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్లు” అంటూ తేలికైన పదాలతో పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా రాశారు.

ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్ తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ, నాయకానాయికలు వేసిన స్టెప్పులు అలరించాయి. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్ మీద ఫుల్ వీడియో సాంగ్ కి థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.


కంప్లీట్ ఎంటర్టైనర్ గా రూపొందిన రూల్స్ రంజన్ అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అయింది.

Related Posts