సూపర్ హీరోగా ప్రభాస్

ఆదిపురుష్‌ టైమ్ లో రిలీజ్ కు రెండు రోజుల ముందు యూఎస్ వెళ్లాడు ప్రభాస్. అక్కడ తన కాలికి ఓ సర్జరీ చేయించుకున్నాడు. ఇది చిన్న గాయమే అయినా పెద్ద ఇబ్బంఇ పెడుతోందట. అందుకే డాక్టర్స్ సలహాతో సర్జరీకి వెళ్లాడు. అక్కడి నుంచి రాగానే డైరెక్ట్ గా ప్రాజెక్ట్ కే సెట్స్ లో అడుగుపెట్టాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా బయటకు తెలియనివ్వడం లేదు మేకర్స్. చాలా సీక్రెట్ గానే షూటింగ్ చేస్తున్నారు.

ఆ మధ్య సినిమాలో అత్యంత కీలకంగా కనిపించే ఓ వీల్ మేకింగ్ వీడియో ను మాత్రం విడుదల చేశారు. టెక్నీకల్ అంశాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి తప్ప.. షూటింగ్ అప్డేట్స్ తెలియనివ్వడం లేదు. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రం కోసం ఏకంగా 800 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఇక సినిమాలో మెయిన్ విలన్ గా కమల్ హాసన్ నటిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ కే కి ఓ భారీ హైప్ వచ్చింది.

కమల్ తో పాటు ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు. ఇక హీరోయిన్ గా దీపికా పదుకోణ్ నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది దీపిక. మళ్లీ ఇన్నాళ్లకు ఈ మూవీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తోంది.


ప్రస్తుతం ప్రాజెక్ట్ కే షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ షూటింగ్ లో దీపికా పదుకోణ్ జాయిన్ అయింది. వీరి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్స్ లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడని సమాచారం. ఇక ఈ సినిమా మల్టీవర్స్ నేపథ్యంలో వస్తోంది. అంటే రకరకాల గ్రహాలకు హీరోతో పాటు విలన్ కూడా ప్రయాణం చేస్తారు. అందుకే ఈ చిత్రానికి ” కాలచక్రం” అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ కే లో కే అంటే అర్థం కూడా అదేనట.. కాలచక్రం అని.


ఈ కాలచక్రాన్ని ఆపేసి మానవ జీవితాలను నాశనం చేయాలనుకునే విలన్ పాత్రలోనే కమల్ హాసన్ కనిపించబోతున్నాడు. అత్యంత బలవంతుడైన విలన్ ను ఎదుర్కొంటూ మానవాళిని కాపాడే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఆ సూపర్ హీరో ఇప్పటి వరకూ మనం చూసిన హాలీవుడ్ స్టార్స్ ను మించి ఉంటాడట. అంటే దీనికి మనదైన దేశీ టచ్ కూడా ఉంటుందని టాక్. అదే సినిమాకు హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు. మొత్తంగా ప్రభాస్ ఆదిపురుష్ లో పురాణ పురుషుడుగా చేసిన తర్వాత సూపర్ హీరోగా రాబోతున్నాడన్నమాట.

Related Posts