మహేష్‌ తో సంయుక్త కాదు, నిధీ కాదు

మహేష్‌ బాబుతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ వదులుకుంటుంది. అది సెకండ్ హీరోయిన్ గా అయినా సరే. వెంటనే ఎగిరిగంతేస్తుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్‌ నటిస్తోన్న గుంటూరు కారం నుంచి మెయిన్ హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డే సడెన్ గా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

దీంతో ఇప్పటి వరకూ సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీ లీల మెయిన్ అయింది. అదే టైమ్ లో మరో సెకండ్ హీరోయిన్ కోసం వేట మొదలైంది. అయితే ఈ రెండో భామగా త్రివిక్రమ్ తెలుగు నేర్పించిన సంయుక్త మీనన్ ఉంటుంది అనుకున్నారు.

పైగా తను వరుస హిట్స్ తో మంచి రైజింగ్ లో ఉంది కూడా. తర్వాత నిధి అగర్వాల్ కు ఆ అవకాశం వస్తుందనుకున్నారు. బట్ ఈ ఇద్దరూ కాదు. ఇప్పుడు మరో హాట్ లేడీని తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తోంది.
తెలుగులో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రంతో పరిచయం అయింది మీనాక్షి.

తర్వాత రవితేజ సరసన ఖిలాడీలో నటించింది. ఖిలాడీలో మీనాక్షి నటనతో పాటు గ్లామర్ కూడా ఆకట్టుకుంది. అందుకే ఈ మూవీ పోయినా.. తర్వాత హిట్ 2లో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా విజయం సాధించింది. ప్రస్తుతం తను ప్రభాస్ సలార్ లో కూడా నటిస్తోంది.

తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఓ మూవీ ఉంది. తనైతే మహేష్ బాబు హైట్ కు కూడా మ్యాచ్ అవుతుంది. అందుకే మీనాక్షి చౌదరిని గుంటూరు కారంలో మరింత ఘాటెక్కించేందుకు తీసుకున్నారంటున్నారు. ప్రస్తుతం ఇది రూమర్ మాత్రమే. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. మరి ఇది నిజమే అయితే మీనాక్షి కెరీర్ మరో టర్న్ తీసుకోవడం ఖాయం అనుకోవచ్చు.

Related Posts