రవితేజాకి షాక్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్?

కాంబినేషన్స్ సెట్ చేశామా? సినిమాలు తీశామా? అని కాకుండా.. ఆయా హీరోల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. బడ్జెట్ ను కంట్రోల్ చేస్తూ సినిమాలు తీసి ఘన విజయాలు సాధిస్తోన్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. నిర్మాత కేవలం క్యాషియర్ అయిపోతున్నాడు అనే విమర్శలు వస్తోన్న ఈ తరుణంలో అగ్ర కథానాయకులతో అదిరిపోయే హిట్స్ అందిస్తున్న ఘనత వీళ్లదే. అయితే.. లేటెస్ట్ గా మైత్రీ మూవీ మేకర్స్ లో రవితేజ-మలినేని గోపీచంద్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. రవితేజ-మలినేని కాంబోలో ఇది నాల్గవ సినిమా కాగా.. మాస్ మహారాజతో మైత్రీ మూవీస్ కి మొదటి సినిమా.

రవితేజ మార్కెట్ కి మించి ఈ మూవీ బడ్జెట్ పెరుగుతున్న కారణాల దృష్ఠ్యా ఈ ప్రాజెక్ట్ ను మైత్రీ మూవీ మేకర్స్ షెల్వ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మలినేని గోపీచంద్ తో ఆల్రెడీ ‘వీరసింహారెడ్డి‘ సినిమా తీసి ఉండడంతో.. అతనితో మాత్రం సినిమా చేయబోతుందట. అయితే.. మలినేని మూవీలో రవితేజ బదులు మరో హీరో వస్తాడనే ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ నుంచి కానీ.. బాలీవుడ్ నుంచి కానీ.. ఓ సీనియర్ హీరోని ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం చేయడానికి సన్నాహాలు చేస్తుందట మైత్రీ సంస్థ. త్వరలోనే.. మలినేనితో మైత్రీ నిర్మించే సినిమాలో హీరో ఎవరనే దానిపై క్లారిటీ రానుందట.

Related Posts