పట్టాలెక్కబోతున్న వరుణ్ తేజ్ ‘మట్కా’

వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో మొదలైన ‘మట్కా’ సినిమా ఉంటుందా? లేదా? అనే ప్రచారం ఈమధ్య సోషల్ మీడియాలో జోరుగా సాగింది. బడ్జెట్ లెక్కలు దృష్ట్యా ఈ సినిమా హోల్డ్ లోకి వెళ్లిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే.. అవన్నీ ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేస్తూ లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్ నుంచి ‘మట్కా’ మొదటి షెడ్యూల్ ని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నారు.

1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ స్టోరీగా ‘మట్కా’ రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకోసం హైదరాబాద్ లో అప్పటి వైజాగ్ ను ప్రతిబింబించే సెట్స్ ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ నటించనున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
వైరా ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Related Posts