తమిళ స్టార్ హీరోతో మలినేని గోపీచంద్?

బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు.. తమిళ స్టార్ హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. తమిళ దళపతి విజయ్ ఇప్పటికే వంశీ పైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. తెలుగు దర్శకుడు మలినేని గోపీచంద్ తో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రవితేజాతో మలినేని చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ స్థానంలో అజిత్-మలినేని కాంబోని సెట్ చేస్తుందట మైత్రీ సంస్థ.

‘తునీవు’ సినిమా తర్వాత అజిత్ తన 62వ చిత్రాన్ని ఆమధ్య మొదలుపెట్టాడు. ఈ సినిమాకి ‘విడాముయిర్చి’ అనే టైటిల్ నిర్ణయించారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అజిత్ కి జోడీగా త్రిష, రెజీనా నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత అజిత్ 63వ సినిమాకోసం ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ పేరు వినిపించింది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అజిత్ 63వ చిత్రాన్నే మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేస్తాడనేది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. మరి.. త్వరలోనే అజిత్-మలినేని కాంబోపై ఏదైనా అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి.

Related Posts