హీరో శర్వానంద్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘మనమే’. శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, రామ్సే స్టూడియోస్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ మూవీలో శర్వానంద్ కి జోడీగా కృతి శెట్టి నటించగా.. ఇతర కీలక పాత్రల్లో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే ‘మనమే’ నుంచి విడుదలైన టీజర్, హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్నందించిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు.
ఆద్యంతం యూరప్ బ్యాక్డ్రాప్ లో కలర్ ఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఓ కేర్ లెస్ అబ్బాయి.. ప్రతీ విషయంలో కేర్ ఫుల్ గా ఉండే అమ్మాయి.. వారిద్దరి మధ్యలో ఓ బాబు.. ఇది స్థూలంగా ‘మనమే’ మూవీ స్టోరీ అని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. విభిన్నమైన స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఓ బాబు తో కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తే ఎలాగుంటోంది.. అనేది ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఎంటర్ టైనింగ్ వే లో చెప్పినట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి.. ట్రైలర్ అయితే కలర్ ఫుల్ గా, ఇంప్రెస్సివ్ గా ఉంది. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న శర్వానంద్ ‘మనమే’ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…
‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…
విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…
సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…