మలయాళం బ్లాక్ బస్టర్ తెలుగులో వచ్చేసింది

మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ‘దృశ్యం’ సిరీస్ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. భారతీయ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లో సైతం రీమేకై.. అక్కడా కలెక్షన్ల సునామీ సృష్టించిన కథ ‘దృశ్యం’. అలాంటి వీరిద్దరి కలయికలో పోయినేడాది డిసెంబర్ 21న విడుదలైన చిత్రం ‘నేరు’.

కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ‘నేరు’ మలయాళంలో అఖండ విజయాన్ని సాధించింది. మలయాళంలో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా.. మాలీవుడ్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్ లోనూ చోటు సంపాదించుకుంది. మోహన్ లాల్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే.. లేటెస్ట్ గా ఈ సినిమా తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

Related Posts