లియ్.. తమిళ్ స్టార్ హీరో ఇళయదళపతి హీరోగా నటిస్తోన్న సినిమా. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా విజయ్ బర్త్ డే స్పెషల్ గా విడుదల చేసింది టీమ్. ఈ స్టిల్ చూస్తే రోరింగ్ గా ఉందనే చెప్పాలి.
రక్తంతో తడిచిన ఓ పెద్ద సుత్తి పట్టుకుని విజయ్ ఎవరినో కొడుతున్నట్టుగా ఉన్నాడు. అతనితో పాటు ఓ హైనా కూడా ఉంది. చూస్తోంటే ఇదో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ లా ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఈ యాక్షన్ సీన్ లో హైనాస్ కూడా ఉండటం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ మాటకొస్తే ఇండియాలోనూ అనుకుంటున్నారు. అక్కడ హైనా ఉండటమే అందుకు కారణం.
ఇండియాలో ఈ తరహా చారల హైనాలు లేవు. ఇంకా చెబితే వీటి సంతతి అంతరించిపోతుందని ఎప్పుడో చెప్పారు. అలాంటి హైనాస్ తో పాటు ఉన్న యాక్షన్ సీన్ అంటే అదీ మంచు కొండల మధ్య.. అంత సులువుగా అయ్యేది కాదు. అందుకే ఈ ఫైట్ కోసం భారీగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేయించారట. కేవలం ఈ యాక్షన్ సీన్ కోసమే నిర్మాణ సంస్థ ఏకంగా పది కోట్లు ఖర్చు పెట్టిందని చెబుతున్నారు.
ఇప్పటి వరకూ కోలీవుడ్ లో వచ్చిన యాక్షన్ సీన్స్ లో ఇదే అత్యంత ఖరీదైన ఫైట్ గా చెబుతున్నారు. అంటే కేవలం ఒక్క ఫైట్ కోసం పది కోట్లు ఖర్చు పెట్టడం తమిళ్ సినిమాల్లో ఇదే ప్రథమం అన్నమాట. ఈ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే ఇదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదు. కానీ ఫస్ట్ అని చెబుతున్నారు కాబట్టి.. ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ దీని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాయి.
ఇక ఈ చిత్రాన్ని తమిళ్ తో పాటు తెలుగులోనూ అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నారు. మామూలుగా పండగల సీజన్స్ లో తమిళ్ సినిమాలు మన సినిమాలతో పోటీ పడటం కామన్ గానే చూస్తున్నాం. తెలుగులో విజయ్ కి భారీ మార్కెట్ లేకపోయినా రీసెంట్ టైమ్స్ బానే పెరిగింది.
కానీ అతనికి లోకేష్ కనకరాజ్ యాడ్ అవడంతో బిజినెస్ పరంగానూ డబ్బింగ్ రైట్స్ కోసం భారీగానే డిమాండ్ చేస్తున్నారట. ఇప్పటికి వినిపిస్తోన్న దాన్ని బట్టి తెలుగు డబ్బింగ్ రైట్స్ ను దాదాపు 30 కోట్లు చెబుతున్నారట. కానీ గతంలో ఇదే కాంబోలో వచ్చిన మాస్టర్ మరీ అంత గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు. అయినా ఈ రేంజ్ లో చెబుతున్నారు అంటే కారణం.. లోకేష్ కనకరాజ్ లాస్ట్ మూవీ విక్రమ్. ఏదేమైనా ఈ మూవీతో తెలుగులోనూ భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో.. అధికారికంగా…
మొత్తానికే ఆగిపోయిందుకున్న ‘ఇండియన్ 2‘ చిత్రం.. తిరిగి పట్టాలెక్కడం.. శరవేగంగా పూర్తవ్వడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న…
నటసింహం బాలకృష్ణ ఒక్కసారి కమిట్ అయితే.. ఎవరీ మాటా వినడు. అప్పటికే బరిలో ఎంతమంది ఉన్నా అస్సలు పట్టించుకోడు. బాక్సాఫీస్…
రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి.‘ చిత్రం ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సైన్స్…
After 'Kalki' in the next three months, another Telugu film 'Pushpa 2' is coming to…
Teja Sajja, who became a new star with the movie 'Hanuman', is playing the hero…