కన్నడ హీరో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా నటించిన కాంతార అంచనాలను మించి ఎలాంటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. దాదాపు 400 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత ఈ సినిమాకి ప్రీక్వెల్ ని అనౌన్స్ చేశారు రిషబ్. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది..నటీనటులు ఎవరనే అప్డేట్స్ ఇప్పటి వరకూ రాలేదు. దాంతో అందరూ ‘కాంతార’ ప్రీక్వెల్ గురించి మర్చిపోయారు.
ఇలాంటి సమయంలో మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా కాంతార 1 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నవంబర్ 27 వ తేదీన మధ్యాహ్నం 12:25 నిమిషాలకి ‘కాంతార పార్ట్ 1’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ‘అది కేవలం వెలుగు మాత్రమే కాదు అది దర్శనం’.. అంటూ ఇచ్చిన ట్యాగ్ లైన్ సినిమాపై ఆకసక్తిని రేపుతోంది.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…