తనను అభిమానించే వాళ్ల కోసం ఎలాంటి సహకారాన్ని అందించడానికైనా వెనుకాడడు నటసింహం బాలకృష్ణ. ఇక.. మొన్నటివరకూ ఎన్నికల వాతావరణంలో ఖాళీ లేకుండా గడిపేసిన బాలకృష్ణ.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమా ఫంక్షన్స్ లో సందడి చేస్తున్నాడు. ఇటీవలే కాజల్ అగర్వాల్ ‘సత్యభామ‘ ట్రైలర్ లాంఛ్ కు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య.. ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం మరోసారి స్టేజ్ పై సందడి చేయనున్నాడట.
నందమూరి కుటంబ కథానాయకులైన బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరితోనూ.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ‘ మూవీ ట్రైలర్ లాంఛ్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
మళ్లీ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నటసింహం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట. మరోవైపు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాని నిర్మిస్తున్న సితార సంస్థలోనే బాలకృష్ణ 109వ సినిమా రెడీ అవుతోంది. అది కూడా ఈ సినిమా ఫంక్షన్ కి బాలయ్య వస్తాననడం వెనుక కారణం. మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ విడుదలకు ముస్తాబవుతోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఓవర్సీస్ మార్కెట్ లో ప్రధానమైన ఏరియా నార్త్ అమెరికా. తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే దేశం…
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాని చాలా రోజుల క్రితమే ప్రకటించారు. స్టార్…
ఒకే కథను రెండు, మూడు భాగాలుగా చెప్పే ట్రెండ్ ఈమధ్య బాగా జోరందుకుంది. భారీ బడ్జెట్ తో రూపొందే పాన్…
మాతృ భాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్ ఆంటోని. కథకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ విజయ్…
రొటీన్ కమర్షియల్ మూవీస్ కి కాలం చెల్లింది. సినిమాలో ఏదో కొత్తదనం ఉంటేనే కానీ.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు.…
In just two days, 'Kalki' collected Rs. 300 crores at the box office worldwide. In…