వరుణ్ తేజ్ కోసం హిట్ బ్యూటీ

కొన్నాళ్లుగా ఓ మంచి హిట్ కోసం ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్నా ఆశించిన సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉన్న ఈ మూవీలో అతని సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.

ఆగస్ట్ 25న విడుదల కాబోతోందీ సినిమా.ఈ మూవీ పూర్తి కాగానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేశాడు వరుణ్. పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరెక్షన్ లో రాబోతోన్న ఈ మూవీ అఫీషియల్ గానే అనౌన్స్ అయింది. 1960ల నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. మరీ అంత పీరియాడిక్ అంటే ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు.


తెలుగులో ఖిలాడీ సినిమాతో పరిచయమైన బ్యూటీ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఫస్ట్ మూవీ పోయినా అమ్మడు నెక్ట్స్ హిట్2 మూవీతో విజయం అందుకుంది. నాని నిర్మాణంలో శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన హిట్2లో అడవి శేష్ సరసన నటించి హిట్ కొట్టింది.

ఆ మధ్య తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. హత్య అనే టైటిల్ తో తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ మీనాక్షి చేతిలో రెండు ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న గుంటూరు కారంలో తను సెకండ్ హీరోయిన్. అలాగే విశ్వక్ సేన్ సరసన మరో సినిమా ఉంది. ఇది థర్డ్ ప్రాజెక్ట్ అవుతుంది.


ఇక పలాస మూవీ తర్వాత కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం అనే సినిమాలుచేశాడు. కానీ ఇవి పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా వరుణ్ ను ఇంప్రెస్ చేశాడు అంటే ఖచ్చితంగా కథలో మేటర్ ఉండే ఉంటుందంటున్నారు. ఇది హిట్ అయితే కరుణ కుమార్ కు మెగా క్యాంప్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

Related Posts