బాలీవుడ్ కా భాయ్ సల్మాన్ ఖాన్ సినిమా అంటే కంట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుంది. ముఖ్యంగా కొన్నాళ్లుగా మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తున్నాడు భాయ్. యశ్ రాజ్ ఫిల్మ్స్ లో అతను మొదలుపెట్టిన టైగర్ సిరీస్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది.
మొత్తం స్పై ఏజెంట్స్ గా మొదలైన ఈ సిరీస్ లోకి రీసెంట్ గా షారుఖ్ ఖాన్ కూడా పఠాన్ లా జాయిన్ అయ్యాడు. అంతకు ముందు కూడా వార్ తో మరో స్పై థ్రిల్లర్ ఇదే బ్యానర్ నుంచి వచ్చాయి. ఈ బ్యానర్ లో కేవలం స్పై థ్రిల్లర్స్ ను మాత్రమే రూపొందించాలని ప్లాన్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్.
ఇక ఈ సిరీస్ నుంచి సల్మాన్ ఖాన్ టైగర్ 3 రాబోతోంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ మూవీలో రీసెంట్ గా షారుఖ్ ఖాన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. పఠాన్ లో సల్మాన్ ఖాన్ తో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చేయించినట్టుగానే టైగర్ 3లో కూడా ఓ భారీ ఫైట్ తో షారుఖ్ కనిపిస్తాడట. ఈ ఫైట్స్ సీక్వెన్స్ ను రీసెంట్ గా చిత్రీకరించారు. ఆ అవుట్ పుట్ చూసి మొత్తం టీమ్ ఫుల్ ఖుషీగా ఉందని టాక్.
ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఈ యేడాది నవంబర్ 10న టైగర్ 3 విడుదల కాబోతోంది. ఇక ఈ సిరీస్ లో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైలో హీరోయిన్ గా కంటిన్యూ అయిన కత్రినా కైఫ్ ఈ థర్డ్ పార్ట్ లోనూ ఉంటుంది. మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ పెట్టింది యశ్ రాజ్ ఫిల్మ్స్.
ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ సినిమాల మార్కెట్ నడుస్తోంది. కాబట్టి.. టైగర్ 3 కూడా అన్ని భాషల్లో విడుదలవుతుంది. హిట్ టాక్ వస్తే 600 – 800 వందల కోట్లు రాబట్టడం చాలా సులువు. ఇవి కాక డిజిటల్, శాటిలైట్ రైట్స్ అంటూ మరో ఇన్ కమ్ సోర్స్ కూడా ఉంది కాబట్టి టైగర్ 3 ఎప్పుడో సేఫ్ అయిపోయాడు అనుకోవచ్చు.
ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘కన్నప్ప‘ టీమ్ సందడి చేస్తోంది. లెజెండరీ యాక్టర్ మోహన్ బాబుతో పాటు.. మంచు…
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తారక్ కి.. సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.…
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రాబోయే క్రేజీ మూవీస్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఒకటి.…