భీమా అంటేనే మాస్‌ ఎనర్జీ

గోపీచంద్ అప్‌కమింగ్ మూవీ ‘భీమా’. హర్ష దర్శకత్వం లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా.. హన్మకొండలో ఎంఎల్‌ఏ నాయిని నర్సింహారెడ్డి, పద్మశ్రీ సమ్మయ్యలు ముఖ్య అతిధులుగా గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు.


చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పాను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదన్నారు గోపీచంద్.


భీమా పేరు వింటేనే పవర్ మాస్ ఎనర్జీ. ఈ కథని గోపీచంద్ గారికి చెప్పే అవకాశం కల్పించిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. గోపిచంద్ గారికి కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైయింది. భీమాలో ఎనర్జీ పవర్ వుంది, ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో మొదలుపెట్టాం. గోపి గారు వండర్ ఫుల్ పర్శన్. చాలా హంబుల్ గా వుంటారు. ఆయన నవ్వుతో మాకు ఎనర్జీ వస్తుంది. మార్చి8న బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. మీ వందశాతం ఎంటర్ టైన్ చేస్తుందన్నారు డైరెక్టర్‌ హర్ష.


మిగతా నటీనటులు ముఖ్య అతిథులు ఈ సినిమా విజయాన్ని కాంక్షించారు.

Related Posts