ఈమధ్య తెలుగు, తమిళం భాషల్లో రీ రిలీజుల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో.. కమల్ హాసన్-శంకర్ కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నాడు నిర్మాత ఎ.ఎమ్.రత్నం. ఇటీవల తమిళంలో ఎ.ఎమ్.రత్నం తన ‘గిల్లీ’ సినిమాని రిరిలీజ్ చేశాడు. కొత్త సినిమాలకు మించిన రీతిలో విజయ్ ‘గిల్లీ’ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఈ సినిమా రీరిలీజ్ లో ఏకంగా రూ.26.50 కోట్లు వసూలు చేసింది.
జూలైలో ‘భారతీయుడు 2’ విడుదలకు ముస్తాబవుతోన్న నేపథ్యంలో.. తన ‘భారతీయుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఎ.ఎమ్.రత్నం. 1996లో విడుదలైన కమల్-శంకర్ ‘భారతీయుడు’ చిత్రాన్ని తెలుగు-తమిళం భాషల్లో నిర్మించింది ఎ.ఎమ్.రత్నం. జూన్ 7న ‘భారతీయుడు’ సినిమాని రెండు భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఎ.ఎమ్.రత్నం. కథ ప్రకారం కూడా ‘భారతీయుడు’కి కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ ఉండబోతుంది. ఆ విధంగానూ ‘భారతీయుడు’ రీ రిలీజ్ ‘భారతీయుడు 2’కి బాగా కలిసొచ్చే అంశం అని భావిస్తున్నారట మేకర్స్. అయితే.. ‘భారతీయుడు’ చిత్రాన్ని ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తే.. ‘భారతీయుడు 2’ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్షన్ అవతారమెత్తాడు. సీనియర్ డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ‘తిరగబడరసామీ..‘ అనే సినిమాతో ప్రేక్షకుల…
‘బలగం‘ వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వరుస సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.…
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘డార్లింగ్‘. ఈ మూవీలో అనన్య నాగళ్ల, మోయిన్, శివారెడ్డి, మురళీధర్ గౌడ్…
విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో రూపొందే హ్యాట్రిక్ మూవీ రేపు ముహూర్తాన్ని జరుపుకోనుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన…
సినిమాలు కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే కాదని.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముఖ్య పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి…