తెలుగు చిత్ర పరిశ్రమ అంతా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈనేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మంచి సత్సంబంధాలున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలను సినీ పెద్దలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతూనే ఉన్నారు.
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటవ్వడం.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎంపికవ్వడం జరిగిన తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి హీరోలు ఆయన్ని కలుసుకోవడం జరిగింది. తాజాగా.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బాలకృష్ణ ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. వీరిద్దరూ కాసేపు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ - నికోలై సచ్దేవ్ పెళ్లి సందడి మొదలైంది. ఈ సెలబ్రేషన్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలకు…
గడిచిన దశాబ్ద కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమ బాగా పుంజుకుంది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఓ బెంచ్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ను మరింత ఎలివేట్ చేసే మూవీ 'దేవర'. కొరటాల శివ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలతో నిమగ్నమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈనేపథ్యంలో.. పవన్…
చిత్ర పరిశ్రమలో చిరంజీవి ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో కొరియోగ్రాఫర్ లారెన్స్ ఒకడు. ‘ముఠామేస్త్రి‘లో గ్రూప్ డ్యాన్సర్ గా…
ఇటీవలే తన ప్రతిష్ఠాత్మక 50వ సినిమా ‘మహారాజ‘తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్ సేతుపతి. ‘మహారాజ‘ తర్వాత…