ఆహాలో స్ట్రీమింగ్ మొదలైన ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్..

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలను చేస్తూనే మరోవైపు ఆహా ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరిస్తున్నారు. ఇప్పటికే ఒక సీజన్ అద్భుతంగా సాగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 బాలయ్య డబుల్ ఎనర్జీతో సాగుతుంది. తాజాగా ఈ టాక్ షోకి ‘యానిమల్’ మూవీ టీమ్ గెస్ట్ గా వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రన్‌బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న సందడి చేశారు.

దీనికి సంబంధించిన తాజా ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ విషయాన్ని ఆహా వీడియో తాజాగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ‘యానిమల్’ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ కి ప్రేక్షకుల నుంచి సాలీడ్ రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 1, 2023 న ప్రపంచవ్యాప్తంగా ‘యానిమల్’ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ ని హిందీలో ‘కబీర్ సింగ్‌’గా తీసి రెండు చోట్ల భారీ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి ‘యానిమల్’ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

Related Posts