గ్రాండ్ గా ‘కలియుగం పట్టణంలో ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ , డైరెక్టర్‌ రమాకాంత్ రెడ్డి. సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న మూవీ ఇది. ఇందులో విశ్వకార్తికేయ, ఆయుషి పటేల్ మెయిన్ లీడ్ చేసారు. ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు.
పిల్లల్లో ఉన్న ప్యాషన్‌కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్‌ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని తెరపై చూపించాలనే కోరిక ఉండేది. రమాకాంత్ రెడ్డి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అయితే బడ్జెట్ మాత్రం ఎక్కువ అవుతుందని డైరెక్టర్ చెప్పారు. అయినా పర్లేదని ముందుకు వచ్చాం. సినిమాలు వద్దు అన్నవాళ్లు కూడా మా టీజర్, ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ మూవీ తరువాత రమాకాంత్‌కు, అలాంటి కొత్త వాళ్లకి చాలా మంది నిర్మాతలు అవకాశం ఇస్తారన్నారు కందుల చంద్ర ఓబుల్ రెడ్డి.

మా చిత్రం ఇంత త్వరగా పూర్తయి, రిలీజ్‌కు రెడీ అవ్వడానికి ఓబుల్ రెడ్డి కారణం. డైరెక్టర్ రమాకాంత్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఈ మూవీకి అన్నీ చక్కగా కుదిరాయన్నారు మహేశ్వర్‌రెడ్డి.
అందరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కలియుగం పట్టణంలో టైటిల్ చాలా కొత్తగా ఉంది. చంద్రబోస్ రాసిన కలియుగం కలుషితం అనే పాట బాగుంది. ఆ పాటనే టైటిల్‌గా పెడితే ఇంకా బాగుండేదని అనుకున్నా. కంటెంట్ కొత్తగా ఉంటే ఆడియెన్స్ ఎలాగూ చూస్తారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు ఏఎం రత్నం.
విశ్వ కార్తికేయ తండ్రి రామానుజంతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. విశ్వని చిన్నతనం నుంచీ చూస్తున్నాను. విశ్వను ఎంతో చక్కగా పెంచారు. అతను చాలా మంచి వాడు. పెద్దలంటే చాలా గౌరవం. విశ్వ కార్తికేయకు ఈ సినిమాతో చాలా మంచి పేరు రావాలి. నటనలో అతను ఎంతో శిక్షణ తీసుకున్నాడు. నిర్మాత ఓబుల్ రెడ్డి ఈ సినిమాను తన ఊర్లో తీయడం చాలా గొప్ప విషయం. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ రమాకాంత్ చేశారు. అలా చేయడం మామూలు విషయం కాదు. మాటలు, పాటలు అన్నీ బాగున్నాయన్నారు సుమన్‌.
చిత్ర నటీనటులు, టెక్నిషియన్స్‌ సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts