విజయ్ దేవరకొండతో పూజాహెగ్డే, రష్మికకు హ్యాండ్ ఇచ్చారా..?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపుల్లో ఉన్నా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనేందుకు ఇది మరో ఎగ్జాంపుల్. చివరగా వచ్చిన లైగర్ తో విజయ్ దాదాపు అభాసుపాలయ్యాడు. కానీ ఎక్కువ డామేజ్ పూరీ జగన్నాథ్ కు జరిగింది అనేది నిజం. ప్రస్తుతం సమంతతో ఖుషీ చిత్రం చేస్తున్నాడు. మజిలీ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

ఈ కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే గౌతమ్ ప్రాజెక్ట్ ను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టి పరశురామ్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మించబోతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఫైనల్ చేశారు.


విశేషం ఏంటంటే పూజాహెగ్డే కూడా ఇప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉంది. ఇటు పరశురామ్ రీసెంట్ గా చేసిన సర్కారువారి పాట మిక్స్ డ్ రిజల్ట్ తెచ్చుకుంది. అయినా కమర్షియల్ గా లాస్ కాదు. అందుకే దిల్ రాజు ఆఫర్ ఇచ్చాడు. బట్ అంతకు ముందు అతను వేర్వేరు నిర్మాతల వద్ద తీసుకున్న అడ్వాన్స్ ల కారణంగా కొంత ఇబ్బంది పడ్డా.. చివరికి అందరికీ అడ్వాన్స్ లు వడ్డీతో సహా వెనక్కి ఇచ్చాడు. ఇందుకోసం పరశురామ్ కు దిల్ రాజు హెల్ప్ చేశాడు.


ఇక పరశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన గీత గోవిందం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో ఇద్దరూ కమర్షియల్ లీగ్ లోకి ఎంటర్ అయ్యారు. అస్సలే మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన గీత గోవిందం ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ టైమ్ లోనే విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా సోషల్ మీడియా పోస్ట్ లు వైరల్ అయ్యాయి.

అప్పటి నుంచీ వీరి మధ్య ఏదో ఉందనే రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ కూడా ఉంది. అందుకే అంతా మరోసారి గీత గోవిందం కాంబో రిపీట్ అవుతుందీ అనుకున్నారు. బట్ పరశురామ్, విజయ్ దేవరకొండ కలిసి రష్మికకు హ్యాండ్ ఇచ్చినట్టున్నారు.

అందుకే పూజాహెగ్డే లైన్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి పూజాహెగ్డే ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఏదేమైనా ఇది కూడా క్రేజీ కాంబినేషన్ గానే కనిపిస్తోంది.

Related Posts