అభిమాని మృతిపై ఎన్టీఆర్ స్పందన

తూర్పుగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో పోలీస్ లు నిర్ధారించారు. కానీ శ్యామ్ ది హత్య అని అభిమానులు ఆరోపిస్తుస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

దీంతో శ్యామ్ ది ఆత్మహత్యా, హత్యా అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులంతా శ్యామ్ మృతిపై సమగ్ర విచారణ చేయాలని పోలీస్ డిపార్ట్ మెంట్ ను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ట్విట్టర్ వేదికగా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ కూడా స్పందించాడు.


” శ్యామ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేస్తుంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ తన స్పందనను తెలియజేశాడు. మొత్తంగా శ్యామ్ మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

Related Posts