నిర్మాత‌గా స్టార్ డైరెక్ట‌ర్ భార్య‌. తొలి చిత్ర‌మే క్రేజీ ప్రాజెక్ట్

టాలీవుడ్ లో స్టార్ హీరోలు ప్రొడ్యూస‌ర్స్ అవ్వ‌డం.. స‌క్స‌స్ ఫుల్ గా రాణిస్తుండ‌డం తెలిసిందే. కొంత మంది హీరోలు అయితే.. మ‌ల్టీప్లెక్స్ రంగంలోకి ప్ర‌వేశించి బిజినెస్ లో దూసుకెళుతున్నారు. హీరోలే కాకుండా డైరెక్ట‌ర్స్ కూడా ప్రొడ్యూస‌ర్స్ గా మారి వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాత‌గా మారి వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్న ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆత‌ర్వాత రాజ‌మౌళి నిర్మాత‌గా మార‌క‌పోయినా.. లాభాల్లో వాటాదారుడిగా ఉంటున్నారు.

ఇక సుకుమార్ కూడా నిర్మాత‌గా మారారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. త‌న శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేస్తున్నారు.కుమారి 21 ఎఫ్ తో సుకుమార్ నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఉప్పెన సినిమాకు భాగస్వామిగా వ్యవహరించి భారీ లాభాల్నే సొంతం చేసుకున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక అండ్ హాసిని సంస్థ నిర్మించే చిత్రాలకు ఇండైరెక్ట్ గా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు త్రివిక్రమ్ తన భార్య c నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రత్యేక నాట్య కార్యక్రమం ద్వారా తన భార్య ప్రతిభని ప్రపంచానికి తెలియజేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆమెని నిర్మాతగా నిలబెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పేరుతో నూతన నిర్మాణ సంస్థని ప్రారంభించారు. ఈ బ్యాన‌ర్ లో తొలి ప్ర‌యత్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మూవీ చేయ‌నున్నారు. సాయి సౌజ‌న్య‌తో పాటుగా సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ కూడా క‌లిసి ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. తెలుగు, త‌మిళలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

Related Posts